‘మహాసముద్రం’ ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

‘మహాసముద్రం’ ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Published on Jul 5, 2020 8:27 PM IST

దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా రాబోతున్న మల్టీస్టారర్ ‘మహాసముద్రం’. ఈ సినిమాలో శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రాణ స్నేహితులుగా కనిపించబోతున్నారని అయితే వారి స్నేహమే ఓ అమ్మాయి వల్ల వైర్యంగా మారుతుందని ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా సినిమా సెకెండ్ హాఫ్ మొత్తం హీరోల మధ్య యాక్షన్ నేపథ్యంలో సినిమా నడుస్తోందని తెలుస్తోంది. అదితిరావు హైదరీ కథానాయికగా నటించబోతున్న ఈ సినిమాకి అనిల్‌ సుంకర నిర్మాత.

ఇక ఈ చిత్రానికి స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. కరోనా పరిస్థితులు ఓ కొలిక్కిరాగానే సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉన్న సిద్ధార్థ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తే ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు