ఇంటర్వ్యూ : డైరెక్టర్ కిషోర్ తిరుమల – అనుపమ పాత్ర సినిమాకే హైలెట్

ఇంటర్వ్యూ : డైరెక్టర్ కిషోర్ తిరుమల – అనుపమ పాత్ర సినిమాకే హైలెట్

Published on Oct 20, 2017 1:36 PM IST


నేను శైలజ సినిమాతో మంచి విజయం అందుకున్న దర్శకుడు కిశోర్ తిరుమల తాజాగా ‘ఉన్నది ఒక్కటే జిందగి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అక్టోబర్ 27 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా డైరెక్టర్ కిషోర్ తిరుమల గారితో ఇంటర్వ్యూ..

మీ చిత్రం రిలీజ్ కు దగ్గరగా ఉంది, ఏం చెప్తారు?

నేను ప్రతి సినిమా మొదటి సినిమాలాగే ఫీల్ అవుతాను, నన్ను నేను నిరూపించుకోవల్సింది ఇంకా చాలా ఉంది. రిలీజ్ దగ్గర పడడంతో నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుంది.

సినిమా ఎలా ఉండబోతుంది?

ఈ కథను ఏడాది క్రితం రాసాను, రామ్ ‘హైపర్’ సినిమా చేస్తున్న సమయంలో కథ వినిపించడం జరిగింది. స్నేహం, ప్రేమ మీద నేను అనుకున్న సింపుల్ పాయింట్ ను ఆసక్తికరమైన కథనంతో తెరకెక్కించను.

రామ్ పాత్ర గురించి ?

రామ్ పాత్ర ఈ సినిమాలో చాలా సరదాగా ఉంటుంది. రెండు విభిన్న లుక్స్ లో రామ్ కనిపించబోతున్నాడు. రామ్ పాత్రకు న్యాయం చేశాడు, అతని నటన సినిమాకు ప్రధాన బలం కానుంది.

అనుపమ పరమేశ్వరన్ గురించి ?

అనుపమ తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకోవడం ఖాయం. చాలా లవ్లీ పాత్ర పోషించింది. తన పాత్రకు తనే సొంతంగా డబ్బింగ్ చెప్పడం విశేషం. రామ్ తో తన సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

హీరోగా కొనసాగుతున్న శ్రీ విష్ణు ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్ర లో నటించాడు ?

విష్ణు ఈ సినిమాలో హీరోకు ఏ మాత్రం తగ్గని పాత్రలో కనిపిస్తారు. నాకు మంచి మిత్రుడు కూడా, ఎటువంటి సందేహాలు లేకుండా తను ఈ పాత్ర చెయ్యడానికి ఒప్పుకున్నాడు.

వెంకటేష్ తో మీ సినిమా గురించి ?

ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ పెండింగ్ లో ఉంది. నానితో ఒక సినిమా చర్చల్లో ఉంది. ‘ఉన్నది ఒక్కటే జిందగి’ సినిమా విడుదల తరువాత నిర్ణయం తీసుకుంటా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు