టాలీవుడ్ లో మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వినాయక్, యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో చేస్తోన్న సినిమా ‘ఇంటిలిజెంట్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు సాయత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదలచెయ్యబోతున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సాయి డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు.
ఆకుల శివ కథ మాటలు అందించిన ఈ సినిమలో పోసాని కృష్ణమురళి, ప్రియదర్శి, నల్లవేణు, భద్రం, వెంకీ, రాహుల్ రామకృష్ణ, నాజర్, జె.పి, రాహుల్దేవ్, దేవ్గిల్ తదితరులు నటించారు. ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మించారు.