పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ‘ఇజం’!

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ‘ఇజం’!

Published on Sep 25, 2016 7:10 PM IST

ism

దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో కళ్యాణ్ రామ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ‘ఇజం’ పేరుతో ఓ మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌తో, టీజర్‌తో అంచనాలను తారాస్థాయికి చేర్చిన ఈ సినిమా మొదట ఈనెల్లోనే విడుదలవుతుందన్న ప్రచారం జరిగినా, ప్రొడక్షన్ పనులింకా పూర్తి కాకపోవడంతో సినిమాను అక్టోబర్‌కు వాయిదా వేశారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను టీమ్ శరవేగంగా పూర్తి చేస్తోంది.

కళ్యాణ్ రామ్ తన డబ్బింగ్ పార్ట్‌ను పూర్తి చేసే పనిలో పడిపోయారు. సినిమా బాగా వచ్చిందని, కళ్యాణ్ రామ్‌కు మరో సాలిడ్ హిట్ వచ్చినట్లే అన్న టాక్ వినిపిస్తోంది. ఓ సామాజిక అంశం చుట్టూ నడిచే కథతో తెరకెక్కిందన్న ప్రచారం పొందిన ఈ సినిమాను కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఆడియో వేడుకను చేపట్టేందుకు టీమ్ సన్నాహాలు చేసుకుంటోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు