దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో కళ్యాణ్ రామ్ల క్రేజీ కాంబినేషన్లో ‘ఇజం’ పేరుతో ఓ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఓ సామాజిక అంశం చుట్టూ ముడిపడి ఉన్న కథతో పూరీ జగన్నాథ్ చేస్తోన్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఇంతకుముందెన్నడూ కనిపించని సరికొత్త లుక్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పాటల చిత్రీకరణ కోసం స్పెయిన్ వెళ్ళేందుకు సిద్ధమైపోయింది.
ఆగష్టు 11వ తేదీన మొదలయ్యే ఈ షెడ్యూల్ కోసం టీమ్ ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ స్వయంగా తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్పై తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అదితి ఆర్య హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సిక్స్ప్యాక్ లుక్లో కనిపించనుండగా, అందుకు సంబంధించిన స్టిల్స్ సెప్టెంబర్ మొదటి వారంలో విడుదలవుతాయని సమాచారం. సెప్టెంబర్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.