ఫ్రిబ్ర‌వ‌రి 7న ‘జాను’ గ్రాండ్ రిలీజ్ !

ఫ్రిబ్ర‌వ‌రి 7న ‘జాను’ గ్రాండ్ రిలీజ్ !

Published on Jan 22, 2020 2:06 PM IST

శ‌ర్వానంద్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం జాను. కాగా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ నిన్న విడుద‌ల చేసింది. ప్రాణం నా ప్రాణం.. నీతో ఇలా గానం తొలి గానం పాడే వేళ‌… అంటూ హార్ట్ ట‌చింగ్ మెలోడీ ప్రేమ‌లోని గాఢ‌త ఈ పాట‌లో తెలియ‌చేస్తుంది.

శ్రీమణి అందించిన సాహిత్యం సరళమైన పదాలతో అర్ధవంతమైన భావంతో ఉండటం, గోవింద్ వ‌సంత సంగీత సార‌థ్యంలో ఫీల్ గుడ్ ట్యూన్ తో ఈ పాట‌ను చిన్న‌యి, గౌత‌మ్ భ‌ర‌ద్వాజ్ అద్భుతంగా ఆల‌పించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సి.ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌ల‌ను విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు