టీజర్ తోనే రికార్డులు క్రియేట్ చేస్తున్న ఎన్టీఆర్ !

టీజర్ తోనే రికార్డులు క్రియేట్ చేస్తున్న ఎన్టీఆర్ !

Published on Jul 12, 2017 8:49 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’ పై అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అమితాసక్తి నెలకొన్న సంగతి విధితమే. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ కూడా ఆ అంచనాల్ని మించేలా ఉండటంతో చిత్ర క్రేజ్ తారా స్థాయికి చేరుకుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పలు అంశాల్లో టాప్ ప్లేస్లో ఉన్న ఈ టీజర్ తాజాగా అఫీషియల్ యూ ట్యూబ్ చానెల్లో 10 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.

ఇప్పటి వరకు ఈ టీజర్ కు 10, 114, 198 హిట్లతో పాటు 2,35,000 లైక్స్ దక్కాయి. ఇంత తక్కువ కాలంలో ఇంతలా ఆదరణ పొందిన టీజర్ ఇదేనని చెప్పొచ్చు. మూడు పాత్రల్లో ఒకటైన నెగెటివ్ షేడ్స్ కలిగిన జై పాత్రపై రూపొందించిన ఈ టీజర్లో ఎన్టీఆర్ విలన్ గా సరికొత్త లుక్ లో కనిపించడమే గాక తన నటనతో అబ్బురపరిచేలా చేశాడు. దానికి తోడు దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయేలా ఉండటంతో టీజర్ బ్రహ్మాండమైన విజయం సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు