ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ మినహా మరే అప్డేట్ లేని బాలక్రిష్ణ 102వ చిత్రం ‘జై సింహా’ అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ ను దాదాపుగా పూర్తి చేసేసింది. అంతటి క్రేజ్ ఉన్న ఈ సినిమా యొక్క టీజర్, పాటల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క టీజర్ వచ్చేవారం విడులవుతుందని తెలుస్తోంది.
అంతేగాక మొదటి పాట కూడా ఆ వారంలోనే రిలీజవుతుందట. ఇకపోతే ఈ చిత్ర ఆడియో ఈ నెల 24న భారీ ఎత్తున జరగనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నయనతార, హరిప్రియ, నటాషా దోషిలు హీరోయిన్లుగా నటిస్తుండగా చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్నారు. సంక్రాతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల్ ముందుకురానున్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.
- ఓన్లీ యాక్షన్ అంటున్న ఎన్టీఆర్ !
- ‘భరత్ అనే నేను’లో కొత్త సన్నివేశాలు !
- షూటింగ్ ముగించుకున్న సుధీర్ బాబు సినిమా !
- ‘మహానటి’ సావిత్రిలోని మానవీయ కోణాన్ని ఆవిషరిస్తుందట !
- శరవేగంగా ఎన్టీఆర్ సినిమా పాటల రికార్డింగ్ !
సంబంధిత సమాచారం :

Subscribe to our Youtube Channel
తెలుగు రుచి - మల్లెమాల సంస్థ వారు అందిస్తున్న ఈ ఆన్ లైన్ కుకింగ్ ఛానెల్ ద్వారా మీరు నోరూరించే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల తయారీని తక్కువ టైమ్ లో నేర్చుకోవచ్చు. ఇందులో అనుభవజ్ఞులైన, ప్రఖ్యాత చెఫ్ లు సులభ రీతిలో అన్ని రకాల వంటకాలను ఎలా చేయాలో మీకు నేర్పుతారు.