సెప్టెంబర్ 26న వస్తున్న ‘జననం’

సెప్టెంబర్ 26న వస్తున్న ‘జననం’

Published on Sep 19, 2014 1:00 AM IST

jananam
భువన్ తేజ్, రాజ్ ప్రియాంత్, గీతా భగత్, శ్రావణి నటినటులుగా సాయిశ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై నూతన నిర్మాత యం.ఎస్.రాజు నిర్మించిన సినిమా ‘జననం’. ఎస్.ఎల్.మణిగంజి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ నిర్మాణంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నిర్మాత ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. గురువారం లేటెస్ట్ టీజర్లను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత యం.ఎస్.రాజు మాట్లాడుతూ.. దర్శకుడిగా మణికి ఇది తొలి సినిమా అయినా చాలా బాగా తీశారు. మా హీరోకి ఈ సినిమాలో ప్రేమ పుట్టింది. అదే ‘జననం’. అమ్మ ప్రేమకు అమ్మాయి తోడైంది. ఇదే క్లుప్తంగా కథ. సెప్టెంబర్ 26న విడుదల చేస్తున్నాం. సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. అని అన్నారు. అంతా కొత్త వారితో రూపొందించిన ఈ సినిమాను ఒక మంచి ఆలోచనతో రూపొందించాను. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని దర్శకుడు మణిగంజి తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు