వర్మను చంపేసిన జనసేన యూత్…మరి వర్మ రియాక్షన్ ఏమిటీ?

వర్మను చంపేసిన జనసేన యూత్…మరి వర్మ రియాక్షన్ ఏమిటీ?

Published on Dec 14, 2019 2:12 PM IST

పట్టువదలని విక్రమార్కుడిగా వర్మ తన వివాదాస్పద చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు థియేటర్స్ లోకి తీసుకువచ్చారు. ఆమూవీ లోని కొన్ని సన్నివేశాలు టీడీపీ, జనసేన పార్టీల వారిని విపరీతమైన ఆగ్రహానికి గురిచేశాయి. బాబు ని కరుడుగట్టిన విలన్ గా , లోకేష్, పవన్ మరియు పాల్ పాత్రను వ్యగ్యంగా వారిని అభిమానించే వారు జీర్ణించుకోలేనంతగా చూపించారని టాక్. దీనితో ఆంధ్రప్రదేశ్ లో ఓ గ్రామానికి చెందిన యూత్ వినూత్న రీతిలో ఆయనపై నిరసన తెలిపారు.

ఆయన చనిపోయినట్లుగా శ్రద్ధాంజలి బ్యానర్ ఏర్పాటు చేయడంతో పాటు ఒకింత పరుష పదాలతో ఆయను తిట్టడం జరిగింది. ఈ సంఘటనపై వర్మ స్పందించారు. సదరు బ్యానర్ ని పోస్ట్ చేయడంతో పాటు, బాబు, లోకేష్, పవన్ వీరాభిమానులు సినిమా గురించి బ్యాడ్ పబ్లిసిటీ చేయడం ఆపి, ఆ మూవీని అర్థం చేసుకోవాలన్నారు. సదరు అభిమానులపై ప్రమాణం చేస్తూ ఎవరిని కించపరచడానికి నేను ఆ సినిమా చేయలేదని, కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం తీశానని చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు