జనతాగ్యారేజ్ సెన్సార్ పూర్తి

జనతాగ్యారేజ్ సెన్సార్ పూర్తి

Published on Aug 26, 2016 1:13 PM IST

janathagarage1
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం తాలూకు షూటింగ్ పార్ట్ ఈమధ్యనే పూర్తయింది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా సినిమా ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ అందించింది. సినిమా రన్ టైమ్ మొత్తం 2 గంటల 40 నిముషాలు ఉన్నట్టు తెలుస్తోంది.

అలాగే సినిమాను కొరటాల శివ చాలా రిచ్ గా తెరకెక్కించారని, ఇది ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ గా ఉండబోతోందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటిస్తుండగా కాజల్ ఒక స్పెషల్ సాంగ్ లో మెరవనుంది. అలాగే మళయాళ సూపర్ స్టార్ మోహాన్ లాల్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు