భారీ మొత్తం వెచ్చించి మరో సినిమాను కొన్న దిల్ రాజు !

భారీ మొత్తం వెచ్చించి మరో సినిమాను కొన్న దిల్ రాజు !

Published on Jun 22, 2017 5:51 PM IST


నిర్మాత దిల్ రాజు డెసిషన్ అంటే ప్రేక్షకులకు మంచి గురి. ఆయన నిర్మించిన లేకపోతే డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు ఖచ్చితంగా మంచి సినిమాలే అయ్యుంటాయనే నమ్మకం ఉంది. అందుకే ఆయనేదైనా సినిమాను కొన్నారంటే చాలు దానికి సగం పబ్లిసిటీ వచ్చేసినట్టే లెక్క. ప్రస్తుతం ఆయన కొనుగోలు చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రం ‘జయ జానకి నాయక’ పరిస్థితి అలానే ఉంది.

ఈ చిత్రం యొక్క నైజాం హక్కుల్ని దిల్ రాజు రూ. 9 కోట్ల భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్నారు. ఈ డీల్ తో సినిమాను ఇంత భారీ ధర పెట్టి దిల్ రాజు కొన్నారంటే అందులో బలమైన కంటెంట్ ఉందనే టాక్ బయలుదేరిపోయింది. పైగా హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ కావడం సినిమాకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇకపోతే కొద్దిరోజుల క్రితమే దిల్ రాజు గోపిచంద్ యొక్క ‘గౌతమ్ నంద’ నైజాం హక్కుల్ని రూ. 6.3 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు