ఓవర్సీస్లో ఎన్టీఆర్ కు ఇదే అతి పెద్ద విడుదల !

ఓవర్సీస్లో ఎన్టీఆర్ కు ఇదే అతి పెద్ద విడుదల !

Published on Sep 19, 2017 3:08 PM IST


తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘జై లవ కుశ’ చిత్రం ఇంకొక్కరోజు వ్యవధిలో రిలీజ్ కానుంది. గత సినిమాలు ‘నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ లు భారీ హిట్లు కావడంతో ఈ సినిమాపై అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి. తారక్ కూడా ఈ చిత్రంతో మంచి ఫలితాల్ని అందుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు. అందుకే గ్యాప్ తీసుకుని ఈ కథను ఎంచుకుని, ఏకంగా మూడు పాత్రల్లో నటించి బాక్సాఫీస్ స్టామినాను రూ. 100 కోట్లకు పెంచుకోవాలనుకుంటున్నారు.

ముఖ్యంగా ఓవర్సీస్లో భారీ రిలీజ్ ప్లాన్ చేశారు. 190 లొకేషనల్లో కలిపి సుమారు 500 స్క్రీన్లలో సినిమా విడుదలకానుంది. ఈ విడుదలతో తారక్ జనతా గ్యారేజ్ తో సాధించిన 2 మిలియన్ డాలర్ల పైచిలుకు వసూళ్లను బ్రేక్ చేయాలని భావిస్తున్నారు. బాబీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నివేత థామస్, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తుండగా ఎన్టీఆర్ జై, లవ, కుశ అనే మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు