నవంబర్లో రానున్న సందీప్ కిషన్ ‘జోరు’

నవంబర్లో రానున్న సందీప్ కిషన్ ‘జోరు’

Published on Sep 26, 2014 3:10 PM IST

Joru-
‘గుండెల్లో గోదారి’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన కుమార్ నాగేంద్ర ద్వితీయ ప్రయత్నంగా సున్దీప్ కిషన్ హీరోగా చేస్తున్న సినిమా ‘జోరు’. సందీప్ కిషన్ సరసన రాశి ఖన్నా, ప్రియ బెనర్జీ, సుష్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఈ సినిమాని నవంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

భీమ్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోని అక్టోబర్ 4న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు. సినిమా సినిమాతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్న సందీప్ కిషన్ ఈ సినిమాతో మరో మెట్టు పైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే ఆచితూచి సినిమా సినిమాకి సంబంధం లేకుండా కథలను ఎంచుకుంటున్నాడు. సందీప్ కిషన్ చేసిన గత రెండు సినిమాలు ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘రారా కృష్ణయ్య’ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద బాగానే కలెక్షన్స్ వసూలు చేసాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు