దేవీశ్రీతో కలిసి లైవ్ పెర్ఫార్మన్స్ చేయనున్న కమల్ హాసన్

దేవీశ్రీతో కలిసి లైవ్ పెర్ఫార్మన్స్ చేయనున్న కమల్ హాసన్

Published on Nov 27, 2014 10:45 PM IST

kamal-hasan-Devi-Sri-Prasad
సౌత్ ఇండియాలో తన మ్యూజిక్ తో అందరినీ ఆకట్టుకుంటున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్. కామన్ గా దేవీశ్రీ ప్రసాద్ పాటలకి సినీ అభిమానులు ఉర్రూతలూగుతారు, అదే దేవీశ్రీ స్టేజ్ ఎక్కి పెర్ఫార్మన్స్ ఇచ్చాడంటే అక్కడున్న స్టేడియం అంతా తన గొంతుతో గొంతు కలిపి, తన స్టెప్పులకి కాళ్ళు కదుపుతారు. అలాంటి దేవీశ్రీ ప్రసాద్ పెర్ఫార్మన్స్ కి లెజెండ్ అయిన కమల్ హాసన్ గొంతు కలిపితే ఎలా ఉంటుంది. చూస్తున్న వారికి ఆనందానికి మరియు అరుపులకి అవధులే ఉండవు.

ఇలాంటి అరుదైన కలయికకి టాలీవుడ్ అంతా ఏకమై నిర్వహిస్తున్న మేము సైతం ప్రోగ్రాం వేదికైంది. అవును నవమబ్ర్ 30వ తేదీన భారీ ఎత్తుఅన్ జరుగుతున్న ఈ కార్యక్రమానికి తమిళ చిత్ర పరిశ్రమ నుంచి కమల్ హాసన్ హాజరవుతున్నాడు. ఆయన సింపుల్ గా హాజరవ్వడమే కాకుండా యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ తో కలిసి స్టేజ్ పైన పాటలు పాడుతూ లైవ్ పెర్ఫార్మన్స్ కూడా ఇవ్వనున్నాడు. అలాగే తమిళ హీరోలైన సూర్య, కార్తీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరినీ అలరించనున్నారు.

ఉత్తరాంధ్ర హుదూద్ బాధితులను ఆదుకోవడం కోసం తెలుగు చిత్ర పరిశ్రమ నిర్వహిస్తున్న ఈ ‘మేము సైతం’ ప్రోగ్రాం ద్వారా వచ్చే మొత్తం మనీని ఏపి సిఎం రిలీజ్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు