ప్రీ రిలీజ్ టూర్ ప్లాన్ చేసిన కార్తికేయ టీం

ప్రీ రిలీజ్ టూర్ ప్లాన్ చేసిన కార్తికేయ టీం

Published on Oct 21, 2014 2:31 PM IST

Karthikeya
ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా సినిమా పబ్లిసిటీ, ప్రమోషన్స్ బాగా ఊపందుకుంటున్నాయి. ఇప్పటి వరకూ ఎక్కువగా హైదరబాద్ లోనే అన్ని రకాల ప్రమోషన్స్ జరిగేవి, సినిమా విడుదలై హిట్ అయితే సక్సెస్ టూర్ వేసి టీం అంతా కలిసి అన్ని ఏరియాలకు వెళ్ళేవారు. కానీ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో కూడా బాలీవుడ్ స్టైల్లో ప్రీ ప్రమోషనల్ టూర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ లిస్టులో మొదటగా నిఖిల్ నటించిన ‘కార్తికేయ’ ప్లేస్ దక్కించుకుందని చెప్పాలి.

నిఖిల్ – స్వాతి జంటగా నటించిన ‘కార్తికేయ’ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 24న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర టీం ప్రీ రిలీజ్ ప్రమోషనల్ టూర్ వేసారు. ఈ రోజు గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి/కాకినాడ ప్రాంతాలను విజిట్ చేయనున్నారు. ముందుగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి గుంటూరులో సమావేశం కానున్నారు. అక్కడ ముందుగా ఈ ‘కార్తికేయ’ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ ని రిలీజ్ చేసి ఆ తర్వాత లోకల్ మీడియాతో సమావేశం కానున్నారు. ఈ వివరాలను స్వయంగా నిఖిల్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

చందు మొండేటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ వచ్చింది. సూపర్ నాచురల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించగా, వెంకట్ శ్రీనివాస్ నిర్మించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు