సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి గత కొంతకాలంగా నడుస్తున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరదించారు. తన రిటైర్మెంట్ మీద ఈరోజు సాయంత్రం తుది నిర్ణయాన్ని వెల్లడిస్తానన్న ఆయన తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తానని ప్రకటన చేశారు. ఈ వార్తతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన సంగీత ప్రస్థానం కొనసాగించమని హృదయపూర్వకంగా కోరిన ప్రేక్షకులను ధన్యవాదాలని, వారి ప్రేమకు, సపోర్ట్ కు తన కృతజ్ఞతలని కీరవాణి అన్నారు.
జక్కన్న సృష్టించిన అద్భుతం ‘బాహుబలి’కి తన సంగీతంతో రెట్టింపు జీవాన్ని అందించిన కీరవాణి బాహుబలి పార్ట్ 1 తర్వాతే రిటైర్మెంట్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ రాజమౌళి కోసం, సినిమా కోసం పార్ట్ 2 కోసం పని చేసిన ఆయన ఆ తర్వాత కూడా రిటైర్మెంట్ ప్రస్తావన తెచ్చి చివరకు సన్నిహితులు, అభిమానుల సలహా మేరకు తనదైన శైలిలో సంగీత వృత్తిలో కొనసాగాలని డిసైడయ్యారు. ఈరోజు ఆయన సంగీతం అందించిన బాహుబలి 2 ఆడియో వేడుక రామోజీ ఫిల్మ్ సిటీలో అంగరంగ వైభవంగా జరుగుతోంది.
And my journey continues. On my own terms. Good news to who ever wished for it and my heart felt gratitude for their love and support ??❤️
— mmkeeravaani (@mmkeeravaani) March 26, 2017