దిల్ రాజు ‘కేరింత’ ఆడియో రిలీజ్ డేట్

దిల్ రాజు ‘కేరింత’ ఆడియో రిలీజ్ డేట్

Published on May 24, 2015 3:50 PM IST

Kerintha
స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసి అవకాశాలు ఇస్తూ కమర్షియల్ గా సక్సెస్ లు అందుకుంటున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం లో బడ్జెట్ లో చేస్తున్న సినిమా ‘కేరింత’. ‘వినాయకుడు’ ఫేం సాయి కిరణ్ అడవి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, శ్రీ దివ్య, తేజస్వి, అవంతిక హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ఈ చిత్ర టీం ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన మొదటి సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం మిక్కి జె మేయర్ సంగీతం అందించిన కేరింత మూవీ ఆడియోని మే 25న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తోంది. ఈ ఆడియో రిలీజ్ కి పలువురు సెలబ్రిటీస్ హాజరుకానున్నారు. కాలేజీ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్ తమను తాము ఐడెంటిఫై చేసుకునేలా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రషెస్ చూసిన మూవీ యూనిట్ సభ్యులు చాలా సంతోషంగా ఉండడమే కాకుండా సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుందనే దీమాను వ్యక్తం చేశారు. అబ్బూరి రవి ఈ సినిమాకి కథా సహకారం అందిచడమే కాకుండా మాటల రచయితగా కూడా పనిచేసాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు