కెజిఎఫ్ 2 నుండి క్రేజీ అప్డేట్ రానుందా?

కెజిఎఫ్ 2 నుండి క్రేజీ అప్డేట్ రానుందా?

Published on Jul 2, 2020 1:26 PM IST

దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న చిత్రాలలో కెజిఎఫ్ 2 ఒకటి. 2018 లో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం హీరో యష్ ని ఓవర్ నైట్ స్టార్ ని చేసింది. ఈ మూవీ విడుదల అక్టోబర్ 23గా ప్రకటించడం జరిగింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఎదో జరగబోతుంది…మీరు అదేమిటో ఊహిస్తూ ఉండండి అని, ఆయన రెండు ఫోటోలు పంచుకున్నారు. ఆ రెండు ఫోటోలలో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉన్నారు. వీరిద్దరిపై ఓ వీడియో చిత్రీకరిస్తున్నట్లు ఉండగా ఆ వీడియో దేని గురించి అయ్యుంటుందని ఆసక్తి రేపుతోంది.

ఐతే యష్ మరియు ప్రశాంత్ నీల్ ఈ మూవీ గురించి ఏదైనా అప్డేట్ లేదా, మూవీ సంగతులు తెలుపుతూ వీడియో చేస్తున్నారేమో అనిపిస్తుంది. మొత్తంగా కెజిఎఫ్2 ఫ్యాన్స్ కోసం ఈ ఇద్దరు ఎదో ప్రిపేర్ చేస్తున్నారు అనిపిస్తుంది. మరి ఆ సర్ప్రైజ్ ఏమిటో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

https://twitter.com/prashanth_neel/status/1278352787814801409?s=20

సంబంధిత సమాచారం

తాజా వార్తలు