‘పద్మశ్రీ’పై తన సంతోషాన్ని వ్యక్తం చేసిన కోట

‘పద్మశ్రీ’పై తన సంతోషాన్ని వ్యక్తం చేసిన కోట

Published on Jan 26, 2015 11:30 PM IST

Kota-Srinivasa-Rao1 (1)
కేంద్ర ప్రభుత్వం తనని పద్మశ్రీతో సత్కరించినందుకు విలక్షణ నటుడు కోటా శ్రీనివాస్ రావు సంతోషం వ్యక్తం చేశారు. తనని ఆదరించిన ప్రతీఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. జాతీయ స్థాయిలో నాల్గవ గరిష్టాత్మక హోదాకు అర్హుడైన కోట ఆనందంలో వున్నారు. తన టాలెంట్ మరియు పరిశ్రమకోసం కష్టపడిన విధానం ప్రభుత్వానికి నచ్చి ఈ అవార్డుని ప్రకటించినట్టు తెలిపారు.

నాటకరంగం నుండి సినిమాలకు వచ్చిన కోట దర్శకులకు, నిర్మాతలకు ప్రియమైన క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. కెరీర్ లో చేసిన అన్ని చిత్రాలలో వందశాతం న్యాయం కనబరుస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. భవిష్యత్తులో సైతం ఇంతే నిబద్ధతతో నటిస్తానని మాటిచ్చారు.

కోట అభిమానులు, ఆప్తులు ఈ వార్తతో సంతోషంలో మునిగితేలుతున్నారు. అసలు ఈ అవార్డు ఆయనకు ఎప్పుడో రావాలని కొంతమంది వాదన.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు