చివరికి క్రిష్ వద్దకు వెళ్లిన బాలక్రిష్ణ సినిమా !

చివరికి క్రిష్ వద్దకు వెళ్లిన బాలక్రిష్ణ సినిమా !

Published on May 23, 2018 11:23 AM IST

నందమూరి బాలక్రిష్ణ ఎంతో ఇష్టంగా మొదలుపెట్టిన చిత్రం ‘ఎన్టీఆర్’. నందమూరి తారక రామారావుగారి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ప్రీ ప్రొడక్షన్ పూర్తై షూటింగ్ మొదలయ్యే సమయానికి దర్శకుడు తేజ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో సినిమాకు బ్రేకులు పడ్డాయి. ఆ తరవాత సీనియర్ దర్శకులు రాఃఘవేంద్రరావు దర్శకత్వ పగ్గాలు చేపడతారని వార్తలు రాగా అవి నిజం కాదని తేలింది.

ఆ తరవాత కొద్ది కాలం బాలక్రిష్ణ స్వయంగా సినిమాను డైరెక్ట్ చేస్తారని కూడ పుకార్లు పుట్టుకురాగా వాటిపై కూడ ఎలాంటి క్లారిటీ అందలేదు. తాజా సమాచారం మేరకు ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం క్రిష్ ముందుకు వెళ్లిందని తెలుస్తోంది. అయితే బాలీవుడ్ చిత్రం ‘మణికర్ణిక’ పనుల్లో బిజీగా ఉండటం మూలాన క్రిష్ ఈ సినిమా విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. మరి క్రిష్ ఈ సినిమాను టేకప్ చేస్తారో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇకపోతే గతంలో క్రిష్, బాలక్రిష్ణలు కలిసి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాకు పనిచేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు