‘కర్నూలు కత్తివా’ అంటూ ఆకట్టుకుంటున్న ‘తెనాలి రామకృష్ణ’ !

‘కర్నూలు కత్తివా’ అంటూ ఆకట్టుకుంటున్న ‘తెనాలి రామకృష్ణ’ !

Published on Oct 20, 2019 6:23 PM IST

కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రాబోతున్న సినిమా ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మొదటి పాటను నేడు విడుదల చేశారు. కర్నూలు కత్తివా.. గుంటూరు మిర్చివా అంటూ సాగే ఈ సాంగ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. సాయి కార్తీక్ ఈ సాంగ్ కి మంచి ట్యూన్ ఇవ్వగా.. గణేష్ మంచి సాహిత్యం అందించగా.. ధనుంజయ్ బాగా పాడారు.

ఇక గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సందీప్ కిషన్ ఎట్టకేలకూ ‘నిన్ను వీడని నీడను నేనే’తో హిట్ అందుకున్నాడు. కానీ సందీప్ కిషన్ కోరుకున్న హిట్ ను మాత్రం అందుకోలేకపోయాడు. అందుకే సాలిడ్ హిట్ కోసం ఈ కామెడీ సినిమా చేస్తున్నాడట. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన హన్సిక కథానాయకిగా నటిస్తోంది. అలాగే రాధికా శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి ఓ కీలక పాత్ర చేస్తోంది. ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు