‘అందాల రాక్షసి’ సినిమాతో సూపర్ క్రేజీ జంటగా మారిపోయిన నవీన్ చంద్ర – లావణ్య త్రిపాఠిలు మరోసారి ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ అన్న సినిమాతో సిద్ధమైన విషయం తెలిసిందే. షార్ట్కట్లో ‘లోల్’ అన్న టైటిల్తో ఈ సినిమా ప్రచారం పొందుతోంది. రాజమౌళి శిష్యుడు జగదీష్ తలసిల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని రిలీజ్కి సిద్ధమైంది. అయితే ఈ సీజన్లో వరుసగా పెద్ద సినిమాలు వచ్చి పడడంతో సినిమాకు సరైన రిలీజ్ డేట్ కోసం దర్శక నిర్మాతలు ఎదురుచూశారు.
కాగా తాజాగా ఈ విషయమై ఓ క్లారిటీకి వచ్చిన లోల్ టీమ్ డిసెంబర్ 11న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రాజమౌళి స్వయంగా ఈ సినిమా ఆడియో రిలీజ్కు హాజరవ్వడంతో లోల్ సినిమాపై మంచి ఆసక్తి రేకెత్తించారు. ఇక కీరవాణి అందించిన మ్యూజిక్, ట్రైలర్ కూడా ఈ సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చింది. రొమాంటిక్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందన్న నమ్మకాన్ని దర్శకుడు జగదీష్ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.