ఈరోజుటితో సినిమాను పూర్తి చేయనున్న రానా !

ఈరోజుటితో సినిమాను పూర్తి చేయనున్న రానా !

Published on Jun 24, 2017 5:58 PM IST


రానా దగ్గుబాటి నటిస్తున్న తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ పై ప్రేక్షకుల్లో ఎంతటి ఆసక్తి వేరే చెప్పనక్కర్లేదు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ బ్రహ్మాండంగా ఉండటంతో సినీ అభిమానుల నుండి విశేష స్పందన దక్కి క్రేజ్ ఇంకాస్త పెరిగింది. ఇకపోతే హైదరాబాద్లో జరుగుతున్న ఆఖరి దశ షూటింగ్ ఈ ఈరోజుటితో ముగియనుంది.

ఒక సాధారణ యువకుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగాడు అనే ఆసక్తికరమైన పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా రానా కెరీర్లో ఒక ముఖ్యమైన సినిమాగా నిలిచిపోతుందని అంటున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు, భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తుండగా నాగులు భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు