బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్ దేశ్పాండే, రవికాలే ప్రధాన తారాగణంగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందిన ‘దండుపాళ్యం’ తెలుగు, కన్నడ భాషల్లో ఘనవిజయం సాధించి కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది. ఆ చిత్రానికి సీక్వెల్గా ఇటీవల విడుదలైన ‘దండుపాళ్యం2’ ఆశించిన స్థాయిలో విజయం సాదించలేదు. తాజాగా ‘దండుపాళ్యం’ సీక్వెల్స్లో భాగంగా ఇప్పుడు ‘దండుపాళ్యం-3’ రాబోతోంది.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా మోషన్ పోస్టర్ తాజాగా విడుదల చేశారు చిత్ర యూనిట్. వచ్చే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీనివాస రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అర్జున్ జన్యా సంగీతం అందిస్తుండగా రజిని తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.