మెల్లగా కోలుకుంటున్న లతా మంగేష్కర్

మెల్లగా కోలుకుంటున్న లతా మంగేష్కర్

Published on Nov 16, 2019 12:00 AM IST

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ నాలుగు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురవగా కుటుంబసభ్యులు ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఊపిరితిత్తుల సమస్య పెద్దది కావడంతో మొదటి రెండు రోజులు ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. వైద్యులు సైతం ఆమె
క్రిటికల్ కండీషన్లోనే ఉన్నట్టు తెలిపారు. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారట.

ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు స్వయంగా తెలిపారు. అమె పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని, ఆమె కోసం ప్రార్థనలు ప్రతిఒక్కరికి కృతజ్ఞతలని అన్నారు. అలాగే బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ ట్విట్టర్ ద్వారా మాట్లాడుతూ ‘లత కుటుంబ సభ్యులతో నేను మాట్లాడాను. అమె కోలుకుంటున్నారు. ఆధారం లేని పుకార్లను ప్రచారం చేయకండి, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’ అన్నారు. మొత్తం మీద అభిమానుల ప్రార్థనలు ఫలించి లతా మంగేష్కర్ కోలుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు