‘లౌక్యం’ ఫస్ట్ కాపీ చూసిన యూనిట్ సభ్యులు

‘లౌక్యం’ ఫస్ట్ కాపీ చూసిన యూనిట్ సభ్యులు

Published on Sep 22, 2014 9:31 AM IST

loukyam
గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘లౌక్యం’. ‘లక్ష్యం’ వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు శ్రీవాస్, గోపీచంద్ కలయికలో వస్తున్న సినిమా ఇది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. నిర్మాణంతర కార్యక్రమాలతో పాటు సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

ఆదివారం మూవీ యూనిట్ సభ్యులు కూకట్ పల్లి బ్రమరాంభ థియేటర్ లో ఫస్ట్ కాపీ చూసుకున్నారు. దర్శకుడు శ్రీవాస్ మరియు ఇతర ప్రొడక్షన్ మెంబెర్స్ హాజరయ్యారు. సౌండ్, పిక్చర్ క్లారిటీలను చెక్ చేసుకున్నారు. మూవీ ఔట్ పుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు. కామెడీ, యాక్షన్ సన్నివేశాలు అద్బుతంగా వచ్చాయని సమాచారం. సినిమా విజయంపై చాలా ధీమాగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు