యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ప్రస్తుతం ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. సుకుమార్ అంటే డీటైలింగ్కు, స్క్రీన్ప్లే మ్యాజిక్కు పెట్టింది పేరు. ఇక మాస్, యూత్లో ఫుల్ ఫాలోయింగ్తో పాటు నటన పరంగా ది బెస్ట్ అనిపించుకున్న హీరో ఎన్టీఆర్. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే దానిపై ఏ స్థాయి అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకు తగ్గట్టుగానే దర్శక నిర్మాతలు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక గత కొద్దికాలం క్రితం లండన్లో పెద్ద ఎత్తున మొదలైన షెడ్యూల్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమాపై ఇప్పట్నుంచే అంతటా మంచి అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన సాటిలైట్ హక్కులను అప్పుడే ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానల్ జెమిని టీవీ సొంతం చేసుకుంది. భారీ మొత్తానికి జెమినీ టీవీ ఈ సినిమా హక్కులను పొందినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా బీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత.