‘లైగర్’ వేట ముంబైలోనే అంటున్న పూరి

‘లైగర్’ వేట ముంబైలోనే అంటున్న పూరి

Published on Jan 26, 2021 5:53 PM IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేస్తున్న చిత్రం ‘లైగర్’. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ వలన ఆగిన ఈ సినిమా చిత్రీకరణను ఇటీవలే మొదలుపెట్టాలని అనుకున్నారు టీమ్. కానీ ముంబైలో కరోనా వ్యాప్తి కాస్త ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్లోనే కావాల్సిన సెట్ వేసి షూటింగ్ చేయాలని భావించారు.

కానీ పూరి మరోసారి నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తోంది. సినిమాను ముంబై సిటీలోనే రెస్యూమ్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఫిబ్రవరిలో మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కథ మొత్తం ముంబై నేపథ్యంలోనే ఉండటం, అక్కడి లొకేషనల్లోనే షూట్ చేయాల్సి ఉండటం కూడ పూరి నిర్ణయంలో మార్పుకు కారణమట. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. తెలుగుతో పాటు హిందీలో కూడ సినిమా రూపొందుతోంది. ఇటీవల విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో హైప్ మరింత పెరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు