నేటి నుండి ‘లౌక్యం’ యూరోప్ షెడ్యూల్.

నేటి నుండి ‘లౌక్యం’ యూరోప్ షెడ్యూల్.

Published on Aug 22, 2014 5:00 PM IST

gopichand

గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లౌక్యం’. ఈ సినిమా యూరోప్ షెడ్యూల్ నేటి నుండి ప్రారంభం అయ్యింది. మూడు పాటలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇటివల విడుదలయిన టీజర్ పక్కా మాస్ కమర్షియల్ సినిమా అని ప్రేక్షకులకు తెలియజేసింది.

‘లక్ష్యం’ తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో తెరకుక్కుతున్న కామెడీ & యాక్షన్ ఎంటర్టైనర్ ‘లౌక్యం’. గోపీచంద్ నటన, క్యారెక్టర్ సినిమాకి హైలైట్ అని దర్శకుడు తెలిపారు. సెప్టెంబర్ మొదటివారంలో ఆడియోను, మూడవ వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు