విరాట్ కోహ్లి, అనుష్కల ప్రేమకథలా…. మధుర శ్రీధర్ రెడ్డి

విరాట్ కోహ్లి, అనుష్కల ప్రేమకథలా…. మధుర శ్రీధర్ రెడ్డి

Published on Jan 28, 2015 2:06 PM IST

sreesanth-Madhura-Sreedhar

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు మధుర శ్రీధర్ రెడ్డి ఓ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేస్తూ.. నిర్మాతగా బిజీగా ఉన్న శ్రీధర్ రెడ్డి, ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టుకుంటున్నారు. 2011లో విడుదలైన ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ తర్వాత మధుర శ్రీధర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.

‘విరాట్ కోహ్లి, అనుష్కల ప్రేమకథ తరహాలో క్రికెటర్ మరియు యాక్టర్ మధ్య జరిగిన కథే ఈ సినిమా. బెట్టింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాం. త్వరలో సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తాం.’ అని మధుర శ్రీధర్ రెడ్డి తెలిపారు.

జనవరి 30న మధుర శ్రీధర్ నిర్మించిన ‘లేడీస్ & జెంటిల్ మెన్’ విడుదలకు సిద్దమైంది. తర్వాత సంజీవ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘ఓం మంగళం మంగళం’ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు