నైజాంలో ‘మహానటి’ 15 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయంటే !

నైజాంలో ‘మహానటి’ 15 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయంటే !

Published on May 24, 2018 4:32 PM IST

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మహానటి’. ఈ నెల 9న విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల ఘన విజయాన్ని అందుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం, కీర్తి సురేష్ నటన కలిసి చిత్రాన్ని అద్భుతంగా మార్చడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను విశేషంగా ఆదరించారు. అన్ని ఏరియాలోని డిస్ట్రిబ్యూటర్లు లాభాల దిశగా పయనిస్తున్నారు.

నైజాం ఏరియాలో మొదటి రోజు నుండి భారీ వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రం నిన్న 15వ రోజు కూడ అదే జోరును కొనసాగించి రూ. 25.28 లక్షల షేర్ ను అందుకుని మొత్తంగా రూ.8.88 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది. దుల్కర్ సల్మాన్, నాగ చైతన్య, సమంత, విజయ్ దేవరకొండలు పలు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు