షూటింగ్ పూర్తిచేసుకున్న ‘మహానటి’ !

షూటింగ్ పూర్తిచేసుకున్న ‘మహానటి’ !

Published on Mar 22, 2018 2:51 PM IST

అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న చిత్రం ‘మహానటి’. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా సమంత జర్నలిస్ట్ పాత్రలోను, నాగ చైతన్య అక్కినేని నాగేశ్వరరావ్ పాత్రలోను, దుల్కర్ సల్మాన్ జెమినీ గణేశన్ పాత్రలోను, విజయ్ దేవరకొండ ఒక ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తైంది.

దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని మొదలుపెట్టిన టీమ్ మే 9వ తేదీన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ ద్విభాషా చిత్రాన్ని తమిళంలో కూడ రిలీజ్ చేయనున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం పాత రోజుల్ని తలపించేలా ప్రత్యేకమైన సెట్స్ వేయడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు