అజ్మీర్ దర్గాలో ప్రార్ధనలు చేసిన మహేష్ బాబు

అజ్మీర్ దర్గాలో ప్రార్ధనలు చేసిన మహేష్ బాబు

Published on Sep 17, 2014 9:41 AM IST

Mahesh
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యాక్షన్ టైనర్ ‘ఆగడు’ ఈ నెల 19న భారీ ఎత్తున విడుదల కావడానికి సిద్దమవుతోంది. సెన్సార్ నుండి ‘యు/ఏ’ సర్టిఫికేట్ పొంది, అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రింట్స్ నేటి నుంచి అన్ని ప్రాంతాలకు వెళ్లనున్నాయి. మరోవైపు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు భారీ ఎత్తున ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు రాజస్థాన్ అజ్మీర్ లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్టి దర్గాని సందర్శించి, ఆగడు సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ప్రార్ధనలు చేసాడు. మహేష్ బాబు గతంలో దూకుడు, బిజినెస్ మేన్, 1-నేనొక్కడినే సినిమాలకు కూడా అక్కడికి వెళ్లి ప్రార్ధనలు చేసారు. మహేష్ బాబు అదే సెంటిమెంట్ ని ‘ఆగడు’ కి కూడా ఫాలో అయ్యారు.

మహేష్ బాబు సరసన మొదటి సారి మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకిఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు. ‘దూకుడు’ తర్వాత మహేష్ బాబు – శ్రీను వైట్ల – 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి రోజు ఆగడు సినిమా ప్రపంచవ్యాప్తంగా 2000కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు