‘ఆగడు’కి డబ్బింగ్ మొదలు పెట్టిన మహేష్ బాబు

‘ఆగడు’కి డబ్బింగ్ మొదలు పెట్టిన మహేష్ బాబు

Published on Aug 31, 2014 12:47 AM IST

aagadu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆగడు’. ఇటీవలే ఈ చిత్ర టీం సినిమాలో మిగిలి ఉన్న రెండు పాటలని యూరప్ లో ఫినిష్ చేసుకొని ఇటీవలే ఇండియా కి తిరిగివచ్చారు. ఎస్ఎస్ తమన్ అందిచిన ఆడియో ఆల్బమ్ మరికొద్ది సేపట్లో హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సౌత్ ఇండియన్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ హాజరు కానున్నాడు.

అలాగే తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ రోజు నుంచి ఈ సినిమాకి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టాడు. మహేష్ బాబు కంటే ముందే ఈ సినిమాలో నటించిన కీలక నటీనటులు తమ పార్ట్ కి డబ్బింగ్ చెప్పారు. మహేష్ బాబు సరసన మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు మహేష్ బాబుతో చేస్తున్న ఈ మూడవ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు