15 సవంత్సరాలు పూర్తి చేసుకున్న ‘నిజం’

15 సవంత్సరాలు పూర్తి చేసుకున్న ‘నిజం’

Published on May 23, 2018 10:24 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘నిజం’ విడుదలై నేటితో 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది . 2003లో మే 23 న విడుదలయింది ఈ చిత్రం . తేజ దర్శక నిర్మాణ సారధ్యంలో మహేష్ బాబు , రక్షిత జంటగా చిత్రం మూవీస్ బ్యానర్ ఫై నిర్మించిన చిత్రం ‘నిజం ‘. రివెంజ్ కథతో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబులోని నటనను వెలికి తీసింది .అయన చూపించిన హావ బావాలు అద్భుతమని చెప్పాలి. ఈ సినిమాకు గాను ఆయన బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు ని అందుకున్నారు. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద విజయం సాధించకపోయిన ఈ సినిమాలో నటించిన నటి నటులకి మంచి పేరును తెచ్చి పెట్టింది .

ఇక ఈ సినిమాలో మహేష్ కి తల్లిగా నటించిన తాళ్లూరి రామేశ్వరి గారికి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా నంది అవార్డు ని సొంతం చేసుకున్నారు.ఈ చిత్రం లో హీరో గోపిచంద్ విలన్ గా అద్భుతమైన నటనను కనబరచగా సీనియర్ హీరోయిన్ రాశి గోపిచంద్ కి లవర్ గా నటించారు . ఆర్ పి పట్నాయక్ సంగీతం అందించిన ఈ చిత్రం లోని పాటలు అప్పట్లో బిగ్ హిట్ గా నిలిచాయి . మహేష్ బాబు కెరీర్ లోనే ఈ చిత్రం ఒక గొప్ప సినిమాగా మిగిలింది. నటన పరంగా మహేష్ ని ఒక మెట్టు పైకి ఎక్కించింది. ఇక ఈ సినిమాని తమిళ , హిందీ , భోజపురి , ఒరియా ,బెంగాలీ బాషలలో రీమేక్ చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు