బ్యాక్ టు ఇండియా అంటున్న మహేష్

బ్యాక్ టు ఇండియా అంటున్న మహేష్

Published on Feb 20, 2020 8:21 PM IST

మహేష్ నేడు హైదరాబాద్ లో ప్రత్యక్షం అయ్యారు. దివంగత నటి విజయ నిర్మల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం కొరకు ఆయన అమెరికా ట్రిప్ నుండి వచ్చినట్లు తెలుస్తుంది. సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రొమోషన్స్ లో బిజీగా గడిపిన మహేష్ కొద్దిరోజుల క్రితం భార్యా పిల్లలతో కలిసి వెకేషన్ కొరకు అమెరికా వెళ్లారు. ఇక నేడు విజయ నిర్మల జయంతి కావడంతో ఆమె విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనితో మహేష్ ఈ కార్యక్రమంలో తండ్రి కృష్ణ గారితో పాటు పాల్గొన్నారు.

సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్, తన తదుపరి చిత్రంగా దర్శకుడు వంశీ పైడిపల్లితో చేస్తున్నారు. మహేష్ కొరకు దర్శకుడు సరికొత్త కథను సిద్దం చేశారని తెలుస్తుంది. ఇక మే నెల నుండి మహేష్-వంశీ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోవాలని అనుకుంటున్నారని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు