కరోనా వైరస్ పై యుద్ధంలో మహేష్ భాగమయ్యారు. దీనిని అరికట్టే ఉద్యమంలో భాగంగా ఆయన బాలీవుడ్ స్టార్స్ తో కలిసి వినూత్న ప్రచారం చేస్తున్నారు. వైరస్ ని అరికట్టాలంటే మాస్క్ తప్పనిసరి అని ఆయన వినూత్న పద్దతితో చెప్పారు. దానికి సంబంధించిన పోస్ట్ మహేష్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. మహేష్ తో పాటు అమితాబ్, హృతిక్ రోషన్, అలియా భట్, ధోని, సల్మాన్, ప్రియాంకా చోప్రా, షారుక్ ఖాన్, టైగర్ ష్రాఫ్ ఈ క్యాంపైన్ లో పాలుపంచుకున్నారు.
దేశంలో అంతకంతకూ కొరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న తరుణంలో ప్రజలలో అవగాహన కొరకు స్టార్స్ అందరూ ఏకమై ఇలా తమ వంతు బాధ్యత నెరవేరుస్తున్నారు. ఇక ఇప్పటికే అనేక మంది స్టార్ హీరోలు ప్రభుత్వాలకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. తమ పరిసరాలలోని పేదలకు ఆహారం సరఫరా చేస్తున్నారు. కొందరు స్టార్స్ వలస కార్మికులకు తమ ఊరు చేరడంలో సాయంగా నిలిచారు.
#WearTheMask@avigowariker's simple yet effective initiative ???????????????????????? #MaskIndia pic.twitter.com/vLjYeXbkB9
— Mahesh Babu (@urstrulyMahesh) May 27, 2020