వంశీ పైడిపల్లికి ఓకే చెప్పిన మహేష్?

వంశీ పైడిపల్లికి ఓకే చెప్పిన మహేష్?

Published on May 27, 2016 2:05 PM IST

mahesh-babu
భారీ అంచనాల మధ్యన గత వారం విడుదలైన ‘బ్రహ్మోత్సవం’ సినిమా అంచనాలను అందుకోలేక, అభిమానులను సైతం నిరాశపరచడంతో, మహేష్ ఇకపై చేయబోయే సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సౌతిండియాలో పాపులర్ డైరెక్టర్ అయిన ఏ.ఆర్.మురుగదాస్‍తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమైన మహేష్, ఆ సినిమా తర్వాత చేయబోయే సినిమాను కూడా ఇప్పట్నుంచే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

ఈ క్రమంలోనే తాజాగా ‘ఊపిరి’ సినిమాతో దర్శకుడిగా తన స్థాయిని పెంచుకున్న వంశీ పైడిపల్లితో మహేష్ ఓ సినిమా చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి చెప్పిన లైన్ మెచ్చి, మహేష్ పూర్తి స్క్రిప్ట్ తయారు చేయమని తెలిపారట. పీవీపీ సంస్థ ఈ సినిమా నిర్మిస్తుందని సమాచారం. ఇక ప్రస్తుతం వంశీ పైడిపల్లి ఈ స్క్రిప్ట్‌ను పూర్తి చేసే పనిలో పడ్డారట. అంతా ఓకే అయ్యాక సినిమాను అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు