లెబనాన్ దేశం నేటి సంఘటనతో ఉలిక్కి పడింది. ఆ దేశ రాజధానిలో బీరట్ లో సంభవించిన భారీ పేలుడు నగరాన్ని ధ్వంసం చేసింది. అగ్నిప్రమాదంగా మొదలైన సంఘటన భారీ పేలుడుకు కారణం అయ్యింది. ఓ గోడౌన్ లో దాచివుంచిన 2700 మెట్రిక్ టన్నుల అమోనియం నైట్రేట్ భారీ పేలుడుకు కారణం అని తెలుస్తుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం 100మంది మరణించగా, 4000 వరకు గాయాలపాలు అయ్యారు.
ఇక ఈ ఘటనలో 2.5 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. కాగా ఈ సంఘటనపై మహేష్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత భయానక సంఘటనగా మహేష్ బీరట్ పేలుళ్లను వర్ణించారు. ఇక మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్న మహేష్, ఘటన బాధితుల కోసం దేవుణ్ణి ప్రార్ధించారు.
Absolutely horrifying to see the devastation in the #BeirutExplosion. My prayers for all the people and their families affected by this unfortunate incident.
— Mahesh Babu (@urstrulyMahesh) August 5, 2020