మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేష్ ప్రతిమ !

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేష్ ప్రతిమ !

Published on Apr 27, 2018 8:30 AM IST

గత రెండేళ్లుగా రెండు భారీ పరాజయాలతో డీలా పడిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ‘భరత్ అనే నేను’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సక్సెస్ తో మహేష్ చాలా సంతోషంగా ఉన్నారు. క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొరటాల శివ తనకు మంచి సినిమాను ఇచ్చారని పలు సందర్భాల్లో తన ఆనందాన్ని వ్యక్తపరిచారు ప్రిన్స్. ఈ ఆనందాన్ని రెట్టింపు చేసేలా మరో విశేషం కూడ జరిగింది.

అదేమిటంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం అధికారులు మహేష్ యొక్క మైనపు ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మ్యూజియం ప్రతినిధులు మహేష్ ను కలిసి ప్రతిమ కోసం అవసరమైన కొలతలు తీసుకున్నారు. ఈ విషయాన్నే తెలుపుతూ ప్రతిష్టాత్మకమైన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో భాగమవడం సంతోషంగా ఉంది అంటూ మహేష్ ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు