అలాంటి కథ చెప్పగలిగినవారికే మహేష్ ఛాన్స్

అలాంటి కథ చెప్పగలిగినవారికే మహేష్ ఛాన్స్

Published on Feb 25, 2020 8:05 PM IST

ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు ఇంకా తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఛాన్నాళ్ల కృతమే ఆయన ‘మహర్షి’ ఫేమ్ వంశీ పైడిపల్లితో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం పైడిపల్లి చెప్పిన కథ మహేష్ బాబుకు నచ్చలేదని, అందుకే ప్రాజెక్ట్ పక్కనపెట్టేశారని అంటున్నారు.

అలాగే పరశురామ్, ప్రవీణ్ సత్తారు లాంటి డైరెక్టర్స్ మహేష్ బాబుకి కథలు చెప్పారని, అవి చర్చల దశలో ఉన్నాయని కూడా అంటున్నారు. ఈ వార్తల్లో నిజానిజాలు ఎంతున్నా మహేష్ మాత్రం కమర్షియల్ కథ చెప్పి మెప్పించగలిగిన దర్శకుడికే అవకాశం ఇస్తారు. ఇటీవలే మహేష్ ఇకపై తాను పక్కా కమర్షియల్ ఫార్మాట్లోనే చిత్రాలు చేస్తానని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పారు.

పైగా గతంలో సందీప్ వంగ, సుకుమార్ లాంటి దర్శకులు చెప్పిన కథల్లో పూర్తిస్థాయి కమర్షియాలిటీ లేకపోవడం మూలంగానే మహేష్ వారితో సినిమా చేయడానికి ఆసక్తి చూపలేదు. సో.. ప్రెజెంట్ మహేష్ ‘పోకిరి, ఒక్కడు, దూకుడు’ లాంటి కమర్షియల్ సబ్జెక్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. మరి అలాంటి స్టోరీ చెప్పి ఆయన్ను ఒప్పించగల దర్శకుడు ఎవరో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు