రజనీ వాడిన జీపును మ్యూజియంలో పెడతారట !

రజనీ వాడిన జీపును మ్యూజియంలో పెడతారట !

Published on May 30, 2017 6:08 PM IST


దేశవ్యాప్తంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఏ స్థాయి అభిమానులున్నారో వేరే చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా చాలా మంది ప్రేక్షకులు ఆయన స్టైల్ కు ఫిదా అయిపోతుంటారు. ఆయన స్టైల్ నే ఫాలో అవ్వాలని ట్రై చేస్తుంటారు. అందుకే సినిమాల్లో రజనీ వాడే కొన్ని వస్తువులకు యమా క్రేజ్ వస్తుంటుంది. తాజాగా కూడా ‘కాల’ సినిమాలో ఆయన ఉపయోగిస్తున్న జీపుకు విపరీతమైన క్రేజ్ పుట్టుకొచ్చింది.

ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ‘కాల’ సినిమా పోస్టర్ లో రజనీ కూర్చొని ఉండే మహీంద్రా థార్ జీపును చూసి దాన్ని గనుక రజనీ సినిమాలో వాడితే అది ఒక లెజెండ్ అవుతుందని, దాన్ని తాను తమ మహీంద్రా కంపెనీ ఆటో మ్యూజియంలో ప్రదర్శనకు పెడతామని ట్విట్టర్ ద్వారా తెలిపారు. దానికి చిత్ర నిర్మాత ధనుష్ స్పందిస్తూ ఆ జీపు ప్రస్తుతం రజనీకాంత్ గారు షూటింగ్లో వాడుతున్నారని, షూటింగ్ అయిన వెంటనే దాన్ని ఇస్తానని సమాధానం తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు