‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కలెక్షన్లను ప్రకటించిన నిర్మాతలు !

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కలెక్షన్లను ప్రకటించిన నిర్మాతలు !

Published on Mar 1, 2017 6:13 PM IST


జనవరి 12న సంక్రాంతి సందర్బంగా విడుదలైన బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలందుకుని మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అంతేకాకుండా ఈ బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా నిలిచింది. మొదటి నుండి ఈ చిత్రం పట్ల ఎన్నో అంచనాలతో ఉన్న బాలకృష్ణ అభిమానులు సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈంత వసూళ్లు వస్తాయో చూడాలని ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ నిర్మాతలు మాత్రం ఓపెనింగ్స్ ఎంత వచ్చాయి, ఓవర్సీస్ ఎంత రాబట్టింది అనే లెక్కలు చెప్పారు తప్ప ఇన్నాళ్లు పూర్తి స్థాయి వసూళ్ల వివరాలు చెప్పలేదు.

పైగా నిర్మాతలు ఇళ్లపై ఐటీ రైడ్స్ కూడా జరగడంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. ఇక లెక్కలు బయటికి రావని అనుకున్నారు. కానీ చిత్ర నిర్మాతలు సాయిబాబా, రాజీవ్ రెడ్డిలు సినిమా రేపటితో 50 రోజులు పూర్తి చేసుకోనున్న సందర్బంగా సినిమా మొత్తం రూ. 77 కోట్ల రూపాయల పైనే వసూళ్లు సాధించిందని ప్రకటించారు. ఈ ప్రకటనతో బాలయ్య అభిమానులు సినిమా ఘన విజయాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు