ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్ మిస్ ఇండియా మేకింగ్ వీడియో

ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్ మిస్ ఇండియా మేకింగ్ వీడియో

Published on Oct 18, 2019 1:05 AM IST

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత మహేష్ కోనేరు నిర్మిస్తున్న తాజా చిత్రం మిస్ ఇండియా. మహానటి ఫేమ్ కీర్తి సురేష్ లీడ్ రోల్ చేస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలై శరవేగంగా జరుగుతుంది. కాగా నేడు కీర్తి సురేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని, ఈ చిత్ర మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఐతే ఈ మేకింగ్ వీడియో తమన్ స్వరకల్పనలో వచ్చిన పాటతో సాగడం విశేషం. కొద్దిసేపటి క్రితం ఈ మేకింగ్ వీడియో విడుదల చేయడం జరిగింది.

“పచ్చి పచ్చి మట్టి జాలే పుట్టుకొచ్చే ఈవేళా, గడ్డిపూసే గజ్జ కట్టి ఆడేలా…,అని జానపద ట్యూన్ లో సాగిన పాట అద్భుతంగా ఉంది. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, నదియా, నవీన్ చంద్ర తదితరులు ఈ మేకింగ్ వీడియోలో కనిపిస్తున్నారు. మేకింగ్ వీడియో మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ మూవీతో పాటు, నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఒక మూవీ, తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా తెరకెక్కుతున్న మరో చిత్రంలో కూడా కీర్తి సురేష్ నటిస్తున్నారు.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు