ఆగస్ట్ లో నిత్యా మీనన్ ‘మాలిని’ విడుదల.

ఆగస్ట్ లో నిత్యా మీనన్ ‘మాలిని’ విడుదల.

Published on Jul 22, 2014 1:00 PM IST

malini

‘దృశ్యం’ చిత్రంతో దర్శకురాలిగా ప్రేక్షకులను మెప్పించారు శ్రీప్రియ. తెలుగులో ఆమెకు ఇదే తోలి సినిమా. మలయాళంలో దర్శకత్వం వహించిన అనుభవం ఉంది. నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో ’22 ఫిమేల్ కొట్టాయం’ అనే సినిమా తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు. అదే సినిమాను తెలుగులో ‘మాలిని 22’ పేరుతో రీమేక్ చేస్తున్నారు.

సమాజంలో జరుగుతున్న అత్యాచారాల నేపధ్యంలో ‘మాలిని 22’ సినిమాను తెరకెక్కించారు. గత ఏడాది నవంబర్లో ఈ సినిమా ఆడియో విడుదలైంది. ఇప్పటివరకు సినిమా విడుదల కాలేదు. ‘ ఆర్టిస్టుల డేట్స్ ప్రాబ్లెమ్ వలన సినిమాలో కొంత షూటింగ్ పార్ట్(ఒక పాట & టాకీ) బాలన్స్ ఉండిపోయింది. త్వరలో షూటింగ్ పూర్తి చేసి, ఆగస్ట్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని శ్రీప్రియ వెల్లడించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు