మంచు వివాహానికి మోడీకి స్పెషల్ ఆహ్వానం.!

మంచు వివాహానికి మోడీకి స్పెషల్ ఆహ్వానం.!

Published on Apr 21, 2015 2:16 PM IST

manoj
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పద్మశ్రీ డా. మోహన్ బాబు మంచు ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. మోహన్ బాబు మాత్రమే కాకుండా ఆయన వారసులైన మంచు విష్ణు, మంచు మనోజ్, లక్ష్మీ మంచులు కూడా ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసుకున్నారు. మోహన్ బాబు ఫ్యామిలీ ఎన్నికల సమయంలో హైదరబాద్ కి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ మంచు ఫ్యామిలీ ఈ రోజు సడన్ గా పార్లమెంట్ లో ప్రధానిని కలిసారు.

కొద్ది సేపటి క్రితమే మంచు ఫ్యామిలీ మొత్తం పార్లమెంట్ దగ్గరికి చేరుకొని, అక్కడే పార్లమెంట్ సెంట్రల్ లో ప్రధాని మోడీని కలుసుకున్నారు. ఈ నెల 20న మంచు వారి ఆఖరి సంతానం మంచు మనోజ్ పెళ్లి మే 20న జరగనుంది. ఈ వివాహ మహోత్సవానికి మోడీని ఆహ్వానిస్తూ మంచు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి స్పెషల్ ఇన్విటేషన్ కార్డ్ ని అందజేశారు. ఆయన కూడా మంచు మనోజ్ కి సుభాశీస్సులను అందించి పెళ్ళికి రావడానికి సముఖత చూపినట్లు సమాచారం. మే 20న మంచు మనోజ్ – ప్రణతిల వివాహ మహోత్సవ హైదరాబాద్ లో జరగనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు