రైతుల కోసం మంచు హీరో వినూత్న ఆలోచన !

రైతుల కోసం మంచు హీరో వినూత్న ఆలోచన !

Published on May 23, 2017 5:50 PM IST


మన దేశంలోని రైతులు ఎంతటి ఆర్ధిక కష్టాల్లో కూరుకుపోయి ఉన్నారో మనం నిత్య్రం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు కూడా తమ తమ రాష్ట్రాల్లోని రైతుల బాగు కోసం పలు సంక్షేమ కార్యక్రమాల్ని రూపొందించి అమలుపరిచే ప్రయత్నంలో ఉండగా పలువురు సెలబ్రిటీలు సైతం రైతుల పట్ల తమ వంతు బాధ్యతను నెరవేర్చేందుకు ముందడుగేస్తున్నారు. అలాంటి వారి జాబితాలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కూడా చేరారు.

సామాజిక సేవా దృక్పథం కాస్తంత మెండుగా ఉండే మనోజ్ మనకు అన్నం పెట్టే రైతులకు అన్నం పెట్టేది ఎవరు. ఆ భాద్యత ఐక్యమత్యానిదే. అది వాళ్ళ జీవితాల్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది అంటూ అందరూ తమ సంవత్సర జీతంలో, ఆదాయంలో ఒకరోజు జీతాన్ని, ఆదాయాన్ని రైతుల కోసం డొనేట్ చేయండి అని ‘సేవ్ ఫార్మర్స్’ విధానానికి పిలుపునిచ్చారు. అందుకోసం ముందుగా ఈ విధానంలో రాజమౌళి,రానా, కేటీఆర్, ధరమ్ తేజ్, జివి. కేశవ్ వంటి ప్రముఖుల్ని భాగస్వాముల్ని చేసి అందరినీ మోటివేట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు