‘శౌర్య, అటాక్’ వంటి వరుస పరాజయాల్లో ఉన్న మంచి హీరో విష్ణు ఈ సంవత్సరం మాత్రం పక్కా ప్లాన్ తో సినిమాల్ని దించుతున్నాడు. ఇప్పటికే ఆయన చేసిన రెండు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటూ రిలీజుకు సిద్ధంగా ఉన్న సమయంలో మూడో సినిమాకి కూడా సైన్ చేశాడు మనోజ్. 2016లో ‘చుట్టాలబ్బాయి’ వంటి హిట్ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు వీరభద్రం చౌదరి ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.
ఈ సినిమా పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఉండనుందట. ఈ ప్రాజెక్ట్ మార్చ్ నెలలో లాంచ్ అయ్యే అవకాశముంది. ఇకపోతే ప్రస్తుతం మనోజ్ అజయ్ ఆండ్రుస్ డైరెక్షన్లో వార్ డ్రామా ‘ఒక్కడు మిగిలాడు’ రిలీజుకు సిద్ధమవుతుండగా ఎస్కె సత్య దర్శకత్వంలో ప్రగ్య జైస్వాల్ జంటగా చేసిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గుంటూరోడు’ ఫిబ్రవరిలో విడుదలకానుంది.