రాజమండ్రి కెళ్ళిన మనోజ్ ‘శౌర్య’

రాజమండ్రి కెళ్ళిన మనోజ్ ‘శౌర్య’

Published on Nov 29, 2015 2:36 PM IST

shourya

మంచు ఫ్యామిలీ నట వారసుడయిన మంచు మనోజ్ మొదటి నుంచి తనదైన ముద్ర వేసుకుంటూ డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. పెళ్లి తర్వాత కాస్త మనోజ్ ప్రస్తుతం చకచకా తన సినిమాలను ఫినిష్ చేస్తూ, బ్యాక్ టు బ్యాక్ తన సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్దం అవుతున్నాడు. ఇప్పటి వరకూ యాక్షన్ తరహా కథలని ఎక్కువగా చేసిన మనోజ్ మొదటి సారి ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరే ‘శౌర్య’. ఈ సినిమాలో మనోజ్ సూపర్ క్లాస్ లుక్ లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడు.

ఇప్పటివరకూ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీసిన దశరథ్ మొదటి సారి చేస్తున్న లవ్ థ్రిల్లర్ ‘శౌర్య’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్ర టీం ఓ 4 రోజుల షెడ్యూల్ కోసం ఈ రోజు రాజమండ్రి వెళ్ళింది. అక్కడ పాపికొండల మధ్య బోట్ లో వచ్చే కొన్ని సన్నివేశాలతో పాటు ఓ పాటలోని బిట్ ని కూడా షూట్ చేయనున్నారు. డిసెంబర్ 10కల్లా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. దీనికంటే ముందు రామ్ గోపాల్ వర్మ – మనోజ్ కాంబినేషన్ లో రూపొందిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘ఎటాక్’ రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు